నేడు కాళోజి.జయంతి

నేడు కాళోజి.జయంతి

ఆయన తెలంగాణ తొలిపొ ద్దు , తెలంగాణ కాంక్షించిన యోధుడు
తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల హక్కులకోసం నిక్కి చ్చిగా పోరాడిన మహావ్యక్తి కాళోజి నా గొడవపేరు తో ప్రజాసమస్యలను అద్భుతంగా ఆవిష్కరించరు. తమజీవితాం తం తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహానీయు లు తన భావాలను తెలంగాణ యాసలో సులువుగా అర్థమ య్యేవిధంగా చెప్పేవారు.తెలం గాణ భాషఅణచవేతకువ్యతిరే కంగా గళం మరియు కలంఏత్తి నారు. నిజాంరాజుయొక్కఅరా చకపాలనకు వ్యతిరేకంగా ఎ మాత్రం సంకోచించకుండా పో రాడారు. తెలంగాణ ఉద్యమం తో పాటు స్వతంత్ర ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.కాళోజీ 1914 కర్ణాటక రాష్ట్రం బీజా పూర్ జిల్లాలోని రట్టిహల్లిలో జన్మించారు. కాలోజీ పుట్టింది కర్ణాటక అయినా కన్నడ హిం దీ, ఉర్దూ, మరాఠీ భాషలు కూ డా బాగా వచ్చేవి. బీజాపూరు నుంచి వచ్చి వరంగల్ జిల్లా లోని మడికొండలో వచ్చి స్థిర పడ్డారు. ప్రజలయొక్కసమస్య లను తన గేయాల రూపంలో  వర్ణించేవారు. ప్రాథమిక విద్య ను మడికొండలో పూర్తి చేసుకు ని హైదరాబాద్లోని చౌమహాల్ పాఠశాలలో, సిటీ కాలేజీ హన్మ కొండలో కాలేజీ విద్యానుపూర్తి చేసి 1939లో న్యాయ కళాశా లలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. చదువు యొక్క ప్రాధాన్యత గుర్తించిప్రతిగ్రామం లో ఒక లైబ్రరీ ఉండాలని కోరు కునేవారు. సత్యాగ్రహ ఉద్య మంలో పాల్గొని కేవలం 25 సంవత్సరాల వయసులో జైలు కు వెళ్లి వచ్చారు. ఈ కాలంలో మనం చూసే పొలిటికల్  ఆ రోజుల్లోనే రాశారు. బురుగుల రామకృష్ణారావు,పీవీ. నరసిం హారావు వంటి వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.గణ పతిఉత్సవాలుజరిపారు.తెలంగాణ ప్రజల్లో చదువు యొ క్క ప్రాముఖ్యతను వ్యాపింప చేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ నుస్థాపించినప్రముఖు లలో ఒకరు. రజాకార్ల దౌర్జన్యా నికి వ్యతిరేకంగా మహా సభలు పెట్టి ధైర్యసాహసాలనుప్రదర్శిం చారు. స్వరాజ్యసమరంలో ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ యూనివర్సి టీ లో  చేర్పించి ఆదుకున్నారు. 1972వ సంవత్సరంలో తామ్ర పత్ర పురస్కారము 1992లో భారత దేశం లో రెండవఅత్యు న్నత పురస్కారం పద్మవిభూష ణ్ అవార్డునుపొందారు.1992  కాకతీయయూనివర్సిటీ నుం చి గౌరవ డాక్టరేట్ పొందారు. కాలోజీనవంబర్13,2002వసంవత్సరంలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తుది శ్వాస విడిచారు.తెలంగాణప్రభుత్వం కాళోజిపై గౌరవతో అతని 100 వ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 2014 నుంచి   తెలం గాణ భాషాదినోత్సవంగా ప్రక టించింది.2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయ న జన్మదినాన్ని నిర్వహిస్తుంది. కాళోజీ పేరు మీద వరంగల్లో ఉన్న ఆరోగ్యవిశ్వవిద్యాలయా నికి అతని పేరు పెట్టింది. హనుమకొండలో కాళోజీ క్షేత్రం కూడా నిర్మించబోతున్నారు. పుట్టుకనిది చావు నీది బతకం తా దేశానిది అని దేశ భక్తిని చాటుకున్న వ్యక్తి. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏఏ పాటి వాడో చూడుఎన్నుకుంటేవెలగ బెట్టడం కాదు ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకొన్న టో పి కాదు పెట్టిన టోపీ చూడు అంటూ తన గొడవ ప్రజల కోసం అంటూ ప్రశ్నించిన భయంలేని కవి ప్రజా కవి కాళో జి. నాది బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష ఇత ర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే వారిని ధై ర్యంగా హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి తెలంగాణ భాషదినో త్సవంగా మారింది. ఏ భాష నీది ఏమి వేషము రా ఈ భాష ఈ వేషం ఎవరికోసం రా ఆంగ్ల మందును మాటల న గానే ఇంత కులుక కుల్కెద వెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గు లేక ఇంకా చెప్పు ఎందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రoబురాదం చు సకిలించు ఆంధ్రుడా సావ వెందుకురాఅంటూతెలుగుభాష పైన మాండలిక భాష పైన ఉన్న ప్రేమను స్పష్టంగా వ్యక్తి కరించాడు. ఇట్లా అన్ని కోణా లలో ప్రపంచంలో జరుగు తు న్న గందరగోళాలన్నింటికీ గొడ వస్పందించింది.కవితల తూ టాలు చిందించింది. అడ్డమైన మురికినంత తన్నేసేజీవనది అతని గొడవ నా గొడవకు ప్రా ప్తి అన్యాయాన్ని ఎదిరించినో డే నాకు ఆరాధ్యుడు అంటూ తన స్పష్టతను వివరించాడు. తన మరణంతరం కాకతీయ వైద్య కళాశాలకు తన దేహాన్ని దానంచేసి వేలాది మందికి ని స్వార్థ సేవలో స్ఫూర్తిని నింపా రు.  తెలంగాణ తొలిపొద్దు, ని త్యం ప్రసరించేభానుడు.అన్యా యం ఎక్కడ ఉంటే అక్కడగొడ వ పడే కాళోజీకి ప్రశ్నించే గొం తుకలు ,అన్యాయన్ని ఎదిరిం చే వారు ఉన్న ప్పు డేనిజమైన నివాళి.సినిమా వీలనీల బాషా గా వ్యక్తీకరించబడ్డ మన తెలం గాణ తెలుగు ఈ రోజు తలెత్తు కొని గౌరవం పొందుతుంది దా నికి కారణం నిస్సందేహంగా కా ళోజీ కారణం ఈ సంత్సరం 20 24  కాళోజి పురస్కారం ప్రము ఖ సాహితీ వేత్త కవి విమర్శకు డునలిమేల.భాస్కర్ ను ఎంపి క చేసింది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments