6వ పాఠము - భాగ్యోదయం - 10వ తరగతి - తెలుగు వాచకం

6వ పాఠము - భాగ్యోదయం - 10వ తరగతి - తెలుగు వాచకం

10 తరగతి - తెలుగు వాచకం

6 పాఠము - భాగ్యోదయం




భాగ్యోదయం.pdf


పాఠ్యాంశ వివరణ

   భాగ్య+ఉదయం=భాగ్యోదయం - అ కారానికి ఉ పరమైనపుడు ఓ వచ్చింది. అ కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశ మవుతాయి.  ఏ,ఓ,అర్ లు వ్యాకరణ పరిభాషలో గుణములు. గుణములు ఎకాదేశంగా వచ్చే సంధి గుణసంధి.


   ఉదయం అనగా వృద్ధి, సృష్టి, పుట్టుక, పైకివచ్చుట, ఉన్నతి, పొద్దుపొడుపు అని మొదలైన అర్థాలు గలవు. భాగ్య అనగా అదృష్టము, సుకృతము, శుభకర్మను అనుభవించుట మొదలైన అర్థములు కలవు.


   “ఒక క్రమములో భాగ్యోదయం అనగా అదృష్టము వలన పొందిన ఉన్నతి అని చెప్పవచ్చు.” కానీ వాస్తవానికి ఈ పాఠము భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో సంమజ ఉన్నతికి చేసిన కృషి గురించి వివరించే జీవిత చరిత్ర ప్రక్రియకు చెందిన వ్యాసము.


ప్రక్రియ పరిచయం

   ఈ పాఠ్యభాగం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవిత విశేషాలను ఇతరులు రాయడం. జీవిత చరిత్ర ప్రక్రియను ఆంగ్లములో బయోగ్రఫీ అంటారు.

 

కవిపరిచయం

   ఈ పాఠ్యభాగ రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన ‘భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం. 


   కృష్ణస్వామి ముదిరాజ్ రాజకీయ వేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, సమాజ సంస్కర్త. 1957 లో హైదరాబాద్ నగరమేయర్ గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫైఏండ్ల అవసరాలకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేసిన దార్శనికుడు. ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించాడు. హైదరాబాద్ నగరాన్ని చాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు.


   1948లో ఉర్దూలో ‘హైదరాబాద్-కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే ‘భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’ రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.


“తన మిత్రుడు భ్యాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసాడు.”


నేపథ్యం/ఉద్దేశం

స్వయంకృషి, ఆత్మ విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. స్వార్థం పెరిగి పోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.


సారాంశం

   కృష్ణస్వామి ముదిరాజ్ రచించిన రచించిన భాగ్యోదయంలో భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో చేసిన సామాజిక సేవ ను సంక్షిప్తంగా వివరించడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ 1888లో జన్మించాడు.


   ధర్మ శాస్త్రాలు చరిత్ర ను బాగా అధ్యయనం చేసి సమాజంలో ఉండే కుల వ్యవస్థ దాని నిజ స్వరూపాన్ని అవగతం చేసుకుని, అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు చేపట్టాడు.


   ఏమీ ఆశించకుండా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల తో పని చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేసాడు. నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం వలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయ మయ్యాయి.


   సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో వివరించి చెప్పి తాగుడు మాన్పించాడు.


  ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిలభారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చి, అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేసాడు.

  

 1925 లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది-హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకుల తో సమంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది.


   1931 జనాభా లెక్కలు సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆదిహిందువులు గా నమోదు చేయించాడు.


   భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. తనను జీవితాంతం సామాజిక సేవ వైపు నడిపించింది. అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది.






0/Post a Comment/Comments