లే నాయనా, లే.... పిలుస్తుంది నిన్నే! వినిపించడం లేదా? నీలో ఉన్న మనసుని, నీ అంతరాత్మ ని, ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా, ఇంతగా పిలుస్తున్నా పట్టించుకోవు ఏమిటి?
నేను నీకు మంచి విషయం చెప్తూ ఉంటే పెడచెవిన పెడతావు.... బుద్ధి మాట వింటూ ఉంటావు. నేనేదో నీకు సరైన మార్గం చెప్పాలని నిన్ను పిలుస్తూ ఉంటాను. అసలు నన్ను పట్టించుకోవు కదా కదా...
నా మాట పట్టించుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండే వాడివి .నా పిలుపు కూడా అప్పుడు మధురంగా వినిపించేది. ఎప్పుడు, సంసారం ,పిల్లలు అంటూ అదే ఆలోచిస్తావ్... నేను ఏం చెప్తున్నా కూడా వినవా...?
ఎప్పుడూ ఒకటే చింత నీకు, ఒకరోజు నీ పిల్లలు తిట్టారని బాధ పడతావు ,మరొక రోజు వాడు బాగుపడటం లేదని బాధ పడతావు ,ఏదో ఒక ఆవేదన పడుతూనే ఉంటావు, నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మాత్రం వినే ఓపిక నీకు ఉండదు. నిత్యం దేవుడా !నువ్వే దిక్కు ,నువ్వే దిక్కు... అంటూ నన్ను స్మరిస్తూ ... అన్ని దిక్కులు తిరిగి దండం పెడతావు సరేగాని ,నేను చెప్పేది మాత్రం వినడానికి సిద్ధంగా ఉండరు. మీ కోరికలు తీరడమే నాకు డ్యూటీ.
కనీసం ఈ రోజైనా నా మాట వినవయ్యా, నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటే ,నాకు మాత్రం ఎప్పుడూ నీ ఆలోచన.., ఎందుకని ఆలోచిస్తున్నావా? నీకు జ్ఞానం ఇచ్చింది నేనే, దుఃఖం వచ్చింది నేనే ,సుఖం కూడా ఇచ్చింది నేనే, ఇవన్నీ ఇచ్చిన నాకు నీ బాధలు తీర్చడం పెద్ద సమస్య కాదు కదా,... అందుకే అంతరాత్మ నుండి నిన్ను పిలుస్తూనే ఉంటాను ,కానీ నన్ను పెడచెవిన పెడతారు...
ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మకంతో నన్ను పిలువు. నీ లోపల అఖండమైన శక్తిని నేను ప్రసాదిస్తాను. ఆ శక్తితో నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నన్ను కూడా తెలుసుకుంటావు .నా ప్రేమ నీకు అర్థం అవుతుంది. నేను ఏం చెప్పాలి అనుకున్నాను, నీ మనసుకు తెలుస్తుంది. అది తెలుసుకున్న రోజు నువ్వు ఏమిటో నీకు తెలుస్తుంది. ఈ జీవితం సుఖమయం అవుతుంది. ప్రశాంత మయం అవుతుంది.
ఎలాగైతే మీరు బంధాల్లో చిక్కుకున్నారు.... నేను కూడా మీ భక్తి అనే బంధం లో చిక్కుకుపోయా... మీలో ఏ ఒక్కరూ బాధపడినా నాకు బాధ. మీరు ఎలా ఉన్నా నేను మీకోసం ఆలోచించి, మీ అంతరాత్మ నుండి మంచి చెడు చెబుతూనే ఉంటాను. కానీ నన్ను గ్రహించారు .మీరు మీ ప్రతి పనిలో నేను ఉంటాను .సత్యాన్ని గ్రహించండి .భక్తితో నమ్మకంతో మెలగండి .అదే మీకు గొప్ప ఐశ్వర్యం. మీ తల్లి లోనే మీ తండ్రి లో నేను ఉన్నాను. మీ మనో మాలిన్యాలను కడిగేయండి అయ్యా... నా మాట వినండి. మరి సెలవు ....నా మాట వింటారు అని ఆశపడుతున్నాను.